ఫిలిప్తీయుల గురించిన సందేశం 
47
1 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది. 
2 యెహోవా ఇలా చెపుతున్నాడు, 
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. 
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. 
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. 
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు. 
3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు. 
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. 
తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. 
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు. 
4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా 
త్వరలో నాశనం చేస్తాడు! 
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన 
వారందరినీ నాశనం చేస్తాడు. 
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. 
క్రేతు* ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు. 
5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. 
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. 
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?† 
6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు. 
నీ ఒరలోనికి నీవు వెళ్లుము! 
ఆగిపో! శాంతించు, అని మీరంటారు. 
7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది? 
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని 
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.” 
